ప్రస్తుతం స్టైలిష్ స్టార్ , ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి “పుష్ప” సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పుష్ప సినిమా కోసం మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన బన్నీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం కాకినాడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శనివారం కాకినాడకు చేరుకున్న బన్నీని చూసి అభిమానులు పెద్ద ఎత్తున గూమిగూడడంతో అల్లు అర్జున్ తన అభిమానులకు అభివాదం చేశారు.పుష్ప సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్నోసార్లు కాకినాడకు వచ్చిన అల్లు అర్జున్ తాజాగా మరోసారి ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ ఇక్కడ కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేయగా తాజాగా రెండు రోజుల పాటు కాకినాడ పోర్టు లోపల చిత్రీకరణ ఉండటం వల్ల అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి మారేడుమిల్లి అడవి ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న అల్లు అర్జున్ రెండు రోజుల వరకు కాకినాడ పోర్టులో షూటింగ్ జరుపుకోనున్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటున్న చిత్రబృందం ఈ సినిమా ఈ ఏడాది చివరికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు.
గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం చేత రెండు భాగాలుగా చిత్రీకరించాలని భావించారు.
ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా కలిసి ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా ఓ గిరిజన యువతి పాత్రలో నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.