స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్నారు.అయితే షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి తాజాగా ఉదయ్ పూర్ లో నిహారిక పెళ్లి వేడుకలో కొద్ది రోజులు కుటుంబంతో కలిసి సరదాగా గడిపి వచ్చారు.
అయితే ఉదయ్ పూర్ వెళ్లే సమయంలో బన్నీ అండ్ ఫామిలీ అందరూ కూడా మాస్కులు వేసుకొని ఎయిర్ పోర్ట్ నిబంధనలని తూచా తప్పకుండా ఫాలో అవుతూ పెళ్లి వేడుకకి వెళ్లారు.ఈ నేపధ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి నార్త్ లో కూడా ఫేమ్ ఉండటంతో ఇప్పుడు ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ అధికారులు అతనిని కరోనా వైరస్ పై సోషల్ అవేర్ నెస్ ప్రచారం కోసం వాడేసుకున్నారు.
ఎయిర్ పోర్ట్ లో దిగి అల్లు అర్జున్ మాస్కులు పెట్టుకొని వెళ్లిన ఫోటోలని ఉపయోగించుకొని అక్కడ ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విమానాశ్రయంలో ఉన్నప్పుడు అతని క్రమశిక్షణని వైమానిక సిబ్బంది ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉదయపూర్ విమానాశ్రయంలో అల్లు అర్జున్ మాస్క్ ధరించి నిబంధనలను పాటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బన్ని ముసుగు ధరించిన ఫోటోని కూడా షేర్ చేశారు.ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్యస్థానాలను చేరాలంటే బన్నీలానే క్రమశిక్షణతో ఉండాలన్న సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా వారు ప్రచారం చేశారు.
ఇలా వేరొక రాష్ట్రంలో తన క్రమశిక్షణతో అధికారులని మెప్పించిన బన్నీకి వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో అరుదైన ఘనతగా అల్లు అభిమానులు చెప్పుకుంటున్నారు.మొత్తానికి ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఒక సామాజిక అవగాహన కోసం అల్లు అర్జున్ ని ఉపయోగించుకోవడం నిజంగా గొప్ప విషయంగానే చెప్పాలి.