స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు సర్టిఫికెట్ ఇచ్చారు.ఈ సినిమాకు థమన్ అందించిన పాటలే ఇందుకు కారణమని చెప్పాలి.
సామజవరగమనా, బుట్ట బొమ్మా, రాములో రాములా వంటి పాటలు ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లడమే కాకుండా థమన్ కెరీర్లోనే బెస్ట్ ఆల్బంగా ఈ సినిమా నిలిచింది.ఇక అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు యూట్యూబ్లో ఇప్పటికే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి.
తాజాగా ‘బుట్ట బొమ్మా’ పాట గ్లోబల్ టాప్ 100 సాంగ్స్లో 15వ స్థానంలో నిలిచింది.ఇప్పటివరకు ఏ తెలుగు పాట అందుకోని ఫీట్ను ఈ పాట అందుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఇక ఈ పాట కేవలం 3 నెలల్లోనే ఏకంగా 190 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఆల్టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమాలో బాన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, త్రివిక్రమ్ టేకింగ్కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించే పనిలో పడ్డాడు.