మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద సూపర్ క్రేజ్ మధ్య రిలీజ్ అయిన విషయం తెలిసిందే.దేశభక్తిని పెంపొందించే సినిమాగా సైరా నరసింహారెడ్డిలో చిరు యాక్టింగ్కు ఫుల్ మార్కులు పడ్డాయి.
ఇక ఈ సినిమా అనేక రికార్డులను సైతం బద్దలు కొట్టింది.భారీ స్థాయిలో రిలీజ్ అయిన సైరా నరసింహా రెడ్డి రిలీజ్ రోజున కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను సృష్టించింది.
ఇప్పుడు మెగాస్టా్ర్ రికార్డులను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ చేశాడు.బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా దాదాపు పూర్తి కావచ్చింది.ఇప్పటికే సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చి భారీ కలెక్షన్లు రాబట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.
ఈ సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపరను కొనసాగిస్తాడని చిత్ర యూనిట్తో పాటు బన్నీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.బన్నీ కెరీర్లో సరైనోడు టాప్ కలెక్షన్లతో నిలవగా అల వైకుంఠపురముతో ఆ రికార్డును అధిగమించాలని బన్నీ చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమాలో బన్నీ నటిస్తాడు.