అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.అల వైకుంఠపురములో సినిమా హిట్ అయినా తర్వాత వెంటనే సుకుమార్ తో సినిమాను స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
అల్లు అర్జున్ మొదటిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది.కొన్ని వారాలపాటు ఇక్కడే జరగనుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
దీని తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అల్లు అర్జున్ ఎప్పటి నుండో డైరెక్ట్ తమిళ్ సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.అయితే వర్కౌట్ అవ్వడం లేదు.
ఇప్పుడు తమిళ్ సీనియర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే గౌతమ్ మీనన్ అల్లు అర్జున్ కోసం ఒక యాక్షన్ కథను సిద్ధం చేసి కూడా పెట్టాడట.
ఏ కథను త్వరలో బన్నీకి వినిపించనున్నాడట.ఏ కథ కనుక అల్లు అర్జున్ కు నచ్చితే కొరటాల శివతో సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది.
చూడాలి మరి అల్లు అర్జున్ తమిళ్ సినిమా చేయాలనే కోరిక నెరవేరుతుందో లేదో అని.