స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే మొదలుపెట్టిన చిత్ర యూనిట్, తొలి షెడ్యూల్ షూటింగ్ను కూడా జరుపుకున్నారు.
కానీ కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఏర్పడటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాతో మరోసారి బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.ఈ క్రమంలో సినిమా షూటింగ్ను శేషాచలం అడవుల్లో చిత్రీకరించేందుకు సుక్కు అండ్ టీమ్ రెడీ అయ్యారు.
కానీ లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ను రొంపచోడవరం అడవుల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.అయితే లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో పుష్ప చిత్ర షూటింగ్కు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.
ఇక ఈ చిత్ర షూటింగ్ను వెంటనే పరిమిత సభ్యులతో నిర్వహించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు.
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీడ్రైవర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన ఈ సినిమాలో చాలా రఫ్లుక్లో కనిపిస్తాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుండగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.సుకుమార్ గత చిత్రం రంగస్థలం రికార్డులను లేపేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.