స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రం ‘పుష్ప’ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కి్స్తున్నాడు ఈ డైరెక్టర్.
కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.దీని కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అయితే పుష్ప సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా కథ పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతుందని తెలుస్తోంది.సుకుమార్ గత చిత్రం రంగస్థలం కూడా పూర్తి రివెంజ్ డ్రామా.అందులో హీరో విలేజ్ బ్యాక్బ్రాప్కు చెందనివాడిగా ఉంటాడు.
అటు హీరోయిన్ కూడా డీగ్లామర్ పాత్రలో నటిస్తుంది.తన అన్నయ్యను హత్య చేసిన వారిని మట్టుబెట్టే పనిలో హీరో ఉంటాడు.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని మరోసారి వాడేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ వల్ల నష్టపోయిన పుష్కక్ రాజ్(బన్నీ), వారిని అంతం చేసేందుకు లారీ డ్రైవర్గా ఆ గ్యాంగ్లో చేరుతాడట.
వారిని పుష్ప ఎలా అంతం చేశాడనేది సినిమా కథ.ఇక హీరోయిన్ కూడా డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది.మొత్తానికి ఈ కథ చూస్తుంటే ఇదేదో సరికొత్త కథలా మాత్రం అస్సలు అనిపించదు.రంగస్థలం చిత్రం లాంటి కథనే మరోసారి సుకుమార్ చూపిస్తున్నాడా అనే సందేహం కలుగులుతంది.
ఇక కొందరైతే ఇది రంగస్థలం 2 అనేస్తున్నారు.మరి ఈ సినిమా నిజంగానే ఇలాంటి కథతో వస్తుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.