అల్లు అర్జున్. సుకుమార్ ల కాంబో లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దేశ వ్యాప్తంగా పుష్ప సాధించిన వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.అయినా సినిమా సాధించిన వసూళ్ల కంటే కూడా అధికంగా ఇప్పుడు ఆ సినిమా లోని పాపులర్ అయిన డైలాగ్స్ మరియు పాపులర్ అయిన మేనరిజం గురించి చర్చ జరుగుతోంది.
ప్రపంచం నలుమూలల తగ్గేదే లే అన్నట్లుగా గడ్డం కింద చేయి పెట్టుకుని యాటిటూడ్ చూపిస్తున్నారు.దేశ వ్యాప్తంగా దాదాపుగా 350 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన పుష్ప సినిమా యొక్క సీక్వెల్ పుష్ప 2 కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.
స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సమయంలో పుష్ప 2 సినిమా ను క్యాన్సిల్ చేశారు అంటూ కొందరు.బన్నీ మరో సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ మరి కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పుష్ప 2 గురించి వస్తున్న వార్తలను దర్శకుడు సుకుమార్ కొట్టి పారేయాలి అనుకున్నాడు.అందులో భాగంగానే చిత్తూరు జిల్లా వాసులు కావాలి అంటూ కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు.
కాస్టింగ్ కాల్ ను ఇప్పటికిప్పుడు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అంటూ కొందరు గుసగుసలాడుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం పుష్ప 2 పై వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పాలనే తప్ప కొత్తగా పెద్దగా ఏమీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈమద్య కాలంలో పుష్ప 2 గురించి వస్తున్న పుకార్లు పుకార్లే అని ఈ కాస్టింగ్ కాల్ ద్వారా దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సినిమా ను సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.