అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప.ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
కరోనా కారణంగా దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది.ఎట్టకేలకు పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో ఈ నెలలో షూటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సమయంలో హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేందుకు కొందరు బాలీవుడ్ నటులు ఆసక్తి చూపడం లేదు.ముఖ్యంగా విలన్ పాత్రలు చేసే ఇద్దరు ముగ్గురు స్టార్స్ మాత్రం అసలు ఈ సమయంలో బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
ఆ కారణంగా ఈ సినిమా కోసం తమిళ నటుడుని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు.
తమిళంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సూపర్ హిట్ సినిమాలను చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో ఆయన ఈ సినిమాలో నటించడమే కాకుండా తమిళం హిందీ కన్నడం లో సందేహం లేకుండా ఆకట్టుకుంటుంది.
ఆయన నటన మరియు బాడీ లాంగ్వేజ్ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కనుక ఆయన ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు.ఇంతకు ఆ నటుడు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.
సినిమా విలన్ విషయంలో అంచనాలు భారీగా పెంచేస్తున్నారు.మరి ఈ అంచనాలను అందుకుంటారా లేదంటే కింద పడిపోతారా అనేది చూడాలి.
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది.చిత్తూరు పల్లెటూరు అమ్మాయిగా ఆమె కనిపించబోతుంది.
ఇకై ప్రత్యేకమైన ఐటెం పాటను బాలీవుడ్ బ్యూటీతో చేయించబోతున్నారట.ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.