ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితి పై అల్లు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అల్లు ఫ్యామిలీ నుండి అప్డేట్స్ రాకపోవడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ తో పాటుగా ఆ ఫ్యామిలీ హీరోలకు మెసేజ్ లను చేస్తున్నారు.అయితే వారి బాధను అర్ధం చేసుకున్న అల్లు అర్జున్ స్వయంగా తనే ఓ అప్డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.కొద్దిపాటి సింటమ్స్ ఉండటం వల్ల క్వారెంటైన్ లోనే ఉన్నానని చెప్పారు అల్లు అర్జున్.
అంతేకాదు తన కోసం ప్రాధనలు చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా షూటింగ్ టైం లోనే అల్లు అర్జున్ కు కరోనా సోకినట్టు తెలుస్తుంది.పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.
అసలైతే ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్న టైం కు వస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మురుగదాస్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
ఆ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని ఇండస్ట్రీ టాక్.