అల్లు అర్జున్ మొన్నటి వరకు సుకుమార్ దర్శకత్వంలో తాను చేస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కోసం ఏక ధాటిగా షూటింగ్ లో పాల్గొన్నాడు.దాదాపు రెండున్నర నెలల పాటు బ్రేక్ లేకుండా షూట్ చేసిన బన్నీ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ వేశాడు.
అక్కడ పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ తిరిగి వచ్చిన వెంటనే తన హోం బ్యానర్ అయిన జీఏ2 లో నిర్మాణం అయిన చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నాడు.బన్నీ వచ్చిన వెంటనే ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
చావు కబురు చల్లగా సినిమా ను కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠి జోడీగా బన్నీ వాసు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని తెలుస్తోంది.
చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠిల లుక్ లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.సినిమా షూటింగ్ సమయం నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.
దాంతో సినిమా కు మంచి బిజినెస్ అయ్యిందని అంటున్నారు.ఇక అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగితే ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెరుగుతాయి.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.చావు కబురు చల్లగా సినిమా ను ప్రయోగాత్మకంగా చిన్న బడ్జెట్ సినిమా గా దర్శకుడు చూపించాడు.
ఇటీవలే విడుదలైన పాటలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.అతి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో చిన్న చిత్రాల రికార్డును బ్రేక్ చేస్తుందా చూడాలి.