సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రెటీలు, కొందరు రాజకీయ వ్యక్తులు, ఓ హోదాలో ఉన్న వ్యక్తులు తమ హోదాలను చూసి బాగా ఫీల్ అవుతూ ఉంటారు.కేవలం తామే కాకుండా తమ కుటుంబ సభ్యుల విషయంలో కూడా బాగా ఓవర్ చేస్తూ ఉంటారు.
తమకు కష్టాలనేటివి, ఆకలి విలువ అనేటివి తెలియవని అంటుంటారు.
నిజానికి తమ కుటుంబ సభ్యుల గురించి తాము ఎన్నేన్నో చెబుతూ ఉంటారు కానీ.
తమ కుటుంబ సభ్యులే కొన్నికొన్ని సందర్భాలలో వారికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటారు.పైగా తామేంటో నిరూపించుకుంటారు.
కానీ ఆ స్టార్స్ మాత్రమే తమ పిల్లలకు ఏమి తెలియదు అన్నట్టుగా అంటుంటారు.
కానీ తాజాగా అల్లు వారి అబ్బాయ్ అలాంటిది కొట్టిపారేశాడు.
స్టార్ కిడ్స్ కు మట్టి వాసననే తెలియదు అంటూ బాగా డైలాగులు కొట్టే వారికి అల్లు వారి వారసుడు సరైన సమాధానం ఇచ్చాడు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అల్లు వారి ఫ్యామిలీ గురించి అందరికీ పరిచయమే.ఈ కుటుంబం నుంచి నిర్మాతగా, హీరోలుగా పరిచయమై మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ఇక ఇందులో ఇటీవలే పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.ఇక ఈయన సినిమా పట్ల ఎంత బాధ్యత గా ఉంటాడో కుటుంబ విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటాడు.
ఈయన భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ పరిచయమే.
ఈమె తన పరిచయాన్ని ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పెంచుకుంది.ఓ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది స్నేహ రెడ్డి.
అంతే కాకుండా తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ లను కూడా చూసుకుంటుంది.
ఇక వీరికి అర్హ, అయాన్ అనే కూతురు, కొడుకు ఉన్నారు.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చాలా వరకూ తన ఇన్ స్టా వేదికగా తన భర్త అల్లు అర్జున్, తన పిల్లలకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.దీంతో ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్ స్టా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో తన కొడుకు అయాన్ మట్టి ని పట్టుకున్నట్లుగా కనిపించగా ఆ ఫోటోకి తెగ లైకులు వచ్చాయి.అంతేకాకుండా అనేక కామెంట్లు కూడా రావడంతో.స్టార్ కిడ్స్ కు మట్టి వాసననే తెలియదు అంటారు.మరి ఇదేంటి అంటూ తోటి స్టార్లను ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి అయాన్ ఫోటో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇక అర్హ కూడా ఇటువంటి వాటిలో బాగా చురుకుగా పాల్గొంటుంది.