ప్రస్తుతం టాలీవుడ్లో థమన్ టైం నడుస్తుంది.ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నా కూడా స్టార్ హీరోలు అంతా కూడా థమన్ వెంట పడుతున్నారు.
చిన్న హీరోలకు మరియు పెద్ద హీరోలకు అందరికి కూడా థమన్ తన పాటలను అందించేందుకు సిద్దం అవుతున్నాడు.అడిగిన వారికి అడిగినట్లుగా ట్యూన్స్ ఇచేస్తున్నాడు.
ఇటీవల ఈయన అల వైకుంఠపురంలో చిత్రంతో మరింత క్రేజ్ను సొంతం చేసుకున్నాడు.అందులోని నాలుగు పాటలు ఇరగదీశాయి.
దాంతో మరింత క్రేజ్ పెరిగింది.
అల వైకుంఠపురంలో చిత్రంకు మంచి పాటలు అందించినందుకు గాను బన్నీ తదుపరి చిత్రానికి కూడా థమన్ను సంగీత దర్శకుడిగా కోరుకుంటున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్తో మ్యూజిక్ సిట్టింగ్స్ వేశాడు.
బన్నీ సినిమా కోసం దాదాపుగా అన్ని పాటలను ట్యూన్ చేయించాడు.రికార్డింగ్ చేయించడమే తరువాయి.
ఇలాంటి సమయంలో థమన్తో సంగీతం చేయిద్దాం అంటూ అల్లు అర్జున్ ప్రపోజల్ను సుకుమార్ వద్ద పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.బన్నీ ప్రపోజల్కు సుకుమార్ అవాక్కయ్యాడట.పూర్తి వర్క్ అయిన తర్వాత ఇప్పుడు సంగీత దర్శకుడిని మార్చడం ఏంటీ అంటూ బన్నీపై సుకుమార్ సన్నితంగా కోపగించుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సమయంలో దేవిశ్రీని మార్చడం కుదరదని సుకుమార్ తేల్చి చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.