అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా నుండి ట్రైలర్ వచ్చింది.
ఆ ట్రైలర్ మొదటి 24 గంటల్లో 30 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.అయితే ఈ సినిమా ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేస్తుందని అంతా ఆశించారు.
కాని చివరి నిమిషంలో ట్రైలర్ ఆలస్యం అవ్వడం వల్ల అభిమానుల్లో గందరగోళం జరిగింది.అసలు ఏం జరిగింది.
ఎప్పుడు మళ్లీ ట్రైలర్ వస్తుందనే విషయాలను చెప్పలేదు.చెప్పా పెట్టకుండా ట్రైలర్ ను విడుదల చేశారు.
దాంతో ట్రైలర్ పై బజ్ కాస్త తగ్గినట్లయ్యింది.అందువల్ల ట్రైలర్ అరుదైన రికార్డును కోల్పోయింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ విడుదల సమయంలో టెక్నికల్ సమస్య వచ్చి ఉండకుంటే ఖచ్చితంగా ఒక మంచి రికార్డు నమోదు అయ్యి ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఓ రేంజ్ లో కుమ్మేశాడు.సినిమా లో ప్రతి ఒక్క పాత్రను ట్రైలర్ లో చూపించాడు.దాంతో ప్రేక్షకులు ఆ పాత్రలను విశ్లేషించడం కోసం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూస్తూ ఉన్నారు.
ట్రైలర్ కు మంచి రియాక్షన్ వచ్చిన నేపథ్యంలో సినిమా మరింత హిట్ అవుతుందనే నమ్మకం ను అంతా వ్యక్తం చేస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఇతర భాషల ట్రైలర్ లు కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.
ప్రతి భాషలో కూడా పుష్ప ది బెస్ట్ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.