స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన బన్నీ, ఈసారి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి కలిసి రాబోతున్నారు సుకుమార్ అండ్ బన్నీ.కాగా గతంలో ఆర్య, ఆర్య-2 లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబో ఇప్పుడు పుష్ప అనే మాస్ ఎంటర్టైనర్తో మనముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండగా, ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు బుల్లితెర యాంకర్ సుమ ఓకే చెప్పిందని, పుష్ప చిత్రంలో ఆమె చేయబోయేది బన్నీ సోదరి పాత్ర అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ వారు ప్రేక్షకులను కోరుతున్నారు.
ఇదే క్రమంలో ఈ సినిమాలో విలన్గా తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.
ఇప్పుడు ఈ పాత్రలో నటించేందుకు మరో తమిళ నటుడు బాబీ సింహా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక లాక్డౌన్ ముగియగానే రెగ్యులర్ షూటింగ్తో పుష్ప యూనిట్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోండగా టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.