క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీన విడుదలయ్యి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పర్వాలేదని అనిపించుకున్నప్పటికి కలెక్షన్ల వర్షం కురిపించింది.హిందీలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.
పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోగా పరిచయం చేశారు.
ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ మార్కెట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోయింది.ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నటించిన సినిమాలు హిందీలో డబ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలోని ప్రతి పాట ప్రతిఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ పాట ద్వారా సమంత మొట్టమొదటిసారి ఐటమ్ సాంగ్ లో నటించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.ఇక ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే పుష్ప సినిమాలోని ఎన్నో పాటలకు సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు డాన్స్ లు చేస్తూ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నటి శ్రద్ధాదాస్ సైతం పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది.పుష్ప హ్యాంగ్ ఓవర్ అని, జస్ట్ ఫ్యాన్ అంటూ నటి చెప్పుకొచ్చారు.
ఫిదా హీరోయిన్ చేసిన ఈ డాన్స్ వీడియో పై అల్లు అర్జున్ స్పందిస్తూ 100 వ దశ భ్రాంతి అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ఇక అల్లుఅర్జున్ శ్రద్ధాదాస్ ఇద్దరు కలిసి సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా సీక్వెల్ చిత్రమైన ఆర్య 2 లో నటించారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ప్రేమిస్తూ తన వెంట పడుతూ శ్రద్ధాదాస్ సందడి చేశారు.ఇక ప్రస్తుతం ఈమె పుష్ప సినిమాలో ఐటం సాంగుకు డాన్స్ చేయడంతో ఈ వీడియోపై ఐకాన్ స్టార్ స్పందించారు.
ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి, రా.రా స్వామి అనే పాటకు కూడా ఎంతోమంది డాన్స్ చేశారు.మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో వారు కూడా ఈ సినిమాలో పాటకు స్టెప్పులు వేస్తూ పుష్ప మానియాలో మునిగితేలుతున్నారు.ఈ సినిమాకు దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పాలి.