స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా కన్నడ భార రష్మిక మందన్న నటిస్తుంది.
సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా సునీల్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు టాక్.
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ ఆయాక ఈమధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభించింది పుష్ప టీం.అయితే సుకుమార్ కు వైరల్ ఫీవర్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడ్డదని తెలుస్తుంది.ఇక రెండు పార్టులుగా అనుకున్న పుష్ప సినిమా మొదటి పార్ట్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
అయితే సుకుమార్ కు ఫీవర్ రావడం వల్ల రెండు వారాలు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.అనుకున్న విధంగా షెడ్యూల్ కూడా పెండింగ్ పడుతుంది.అక్టోబర్ కల్లా పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్.కాని ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడగా అనుకున్న టైం కు షూటింగ్ పూర్తి కాదని తెలుస్తుంది.
సో పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది రిలీజ్ ఆశలు వదులుకోవాల్సిందే అని అంటున్నారు.