అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పుష్ప.ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభించాల్సి ఉన్నా బన్నీ అల వైకుంఠ పురం లో సినిమా షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.
ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాలని భావించినా అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా సక్సెస్ లో మూడ్ లో బన్నీ ఉండడం వల్ల పుష్ప మూవీ షూటింగ్ మళ్లీ ఆలస్యమైంది.ఎట్టకేలకు మార్చిలో ఈ సినిమాను ప్రారంభించాలని సుకుమార్ అన్ని ఏర్పాట్లు చేశాడు.
మొదటి షెడ్యూల్ ను బన్నీ లేకుండానే ప్రారంభించాడు.బన్నీ కూడా జాయిన్ కాబోతున్నాడు అనుకుంటున్న సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలుగా షూటింగ్ వాయిదా పడింది.
టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలయ్యాయి.
ఈ నెల నుండి పుష్పను ప్రారంభించబోతున్న చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా పేర్కొన్నారు.
కానీ తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఈ నెలలో కూడా పుష్ప ప్రారంభం అవ్వడం అనుమానమే అంటున్నారు.కేరళలోని అడవుల్లో సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం అక్కడ అనుకూలమైన వాతావరణం లేదని అంటున్నారు.వచ్చే నెలతో వర్షా కాలం దాదాపుగా పూర్తి అవుతుంది.
కనుక సినిమాను అప్పుడు కేరళ అడవుల్లో తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నాడట.ఏంటో పుష్ప సినిమాకు అన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నాడు.తెలుగుతో పాటు సౌత్ లో మరియు ఉత్తరాది అన్ని భాషల్లో కూడా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప సినిమా బన్నీకి మొదటి ఇండియా సినిమా అవ్వబోతుంది.