టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని రికార్డ్ కలెక్షన్స్ కూడా అందుకున్నాడు.ప్రస్తుతం అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది.
మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.
అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మొదటి భాగం ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి పూర్తి చేయబోతున్నారు.
అయితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పుష్ప ఆల్బమ్ పై మంచి హైప్ ఏర్పడింది.ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు రావడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలొకొన్నాయి.ఈ వార్త విని అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరి ఎప్పుడు విడుదల చేస్తారో వేచి ఉండాల్సిందే.ఇది ఇలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.