స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం వారు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఓ అదిరిపోయే కాంబో గురించి వార్తలు వినిపిస్తున్నాయి.కన్నడలో కేజీయఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
కాగా ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెలుగు స్టార్ హీరోతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే తొలుత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
పుష్ప చిత్రంలో బన్నీ ఊరమాస్ లుక్కు ప్రశాంత్ నీల్ బాగా ఇంప్రెస్ అయ్యాడని, అందుకే బన్నీతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించే ప్లాన్లో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.మరి ఈ కాంబో గనక నిజంగా సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.