కరోనా కారణంగా ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు కాలక్షేపం కోసం ఏదో ఒక పని చేస్తున్నారు.కొంత మంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటే, మరికొంత మంది రకరకాల చాలెంజ్ లతో సందడి చేస్తున్నారు.
కొంత మంది దొరికిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ ఖాళీ సమయంలో పూరీ జగన్నాథ్ కూడా ఓ కొత్త పని పెట్టుకున్నాడు.
అయితే తన సినిమాల ద్వారా ఎప్పుడు సోషల్ మెసేజ్ లు ఇవ్వడానికి ఇష్టపడని పూరీ ఇప్పుడు ప్రజలని సోషల్ మీడియా ద్వారా కాస్తా ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నాడు.డిప్రెషన్ లోకి వెళ్ళకుండా మంచి సలహాలు, పవర్ ఫుల్ స్పీచ్ తో కాస్తా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికోసం పాడ్ కాస్ట్ అనే ఆడియో స్పీచ్ లతో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు.
ఈ పాడ్ కాస్ట్ లో రోజుకొక టాపిక్ తీసుకొని దాని గురించి క్లుప్తంగా, ఆసక్తికరంగా చెబుతూ చివర్లో జనాలకి అర్ధమయ్యే రీతిలో మంచి మెసేజ్ ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు అతను ఈ పాడ్ కాస్ట్ ద్వారా ఆత్మహత్యల గురించి, తల్లి గురించి, అలాగే తన జీవితంలో జరిగే కొన్ని అనుభవాలని ఆడియో ద్వారా పంచుకుంటున్నారు.ఒక సక్సెస్ ఫుల్ పెర్సన్ చెబితే ఎలాంటి మాటలైనా ప్రజలు వింటారు.
అలాగే ఇప్పుడు ఈ పూరీ జగన్నాథ్ అనుభవాలు, ఆలోచనలతో సాగే పాడ్ కాస్ట్ కి మంచి ఆదరణ లబిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ పాడ్ కాస్ట్ లో వృద్ధాప్యం గురించి ఓ ఆడియో బైట్ పెట్టాడు.
ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యింది.తాజాగా అల్లు అర్జున్ పూరీ పాడ్ కాస్ట్ పై ప్రశంసలు కురిపించాడు.
పూరీ పాడ్ కాస్ట్ ద్వారా అద్భుతమైన విషయాలు, నిజమైన ఎన్నో చెబుతున్నారు.వ్యక్తిగతంగా ఇది నాకు భాగా నచ్చింది అని కామెంట్ చేశాడు.
దీనిపై పూరీ కూడా స్పందించి మీలాంటి సక్సెస్ ఫుల్ యంగ్ స్టార్ నుంచి ఇది నాకు పెద్ద అభినందన.ఈ రోజు నీ కోసం ఓ పెగ్గు ఎక్స్ ట్రా వేస్తా బన్నీ అని రీట్వీట్ చేశాడు.