కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.ఈ టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.
అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది.
దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక సినిమాని తెరకెక్కించదానికి ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాడు.అయితే ఆ సినిమా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత ప్రారంభం అవుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఇమేజ్ ని టాలీవుడ్ నిర్మాతలు పూర్తిగా వాడుకోవడానికి రెడీ అయిపోయినట్లు ఉన్నారు.ఇండియన్ వైడ్ గా పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు పొందిన స్టార్స్ అంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఉన్నారు.
అయితే రాజమౌళి ప్లానింగ్ ప్రకారం నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు.ఈ నేపధ్యంలో అతను ఎవరికీ అందుబాటులో దొరకడు.
కొడుకుని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్న అల్లు అరవింద్ దానికి తగ్గట్లుగానే ఇప్పుడు తెరపైకి ప్రశాంత్ నీల్ ని తీసుకొచ్చాడు.ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
తరువాత కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా పాన్ ఇండియానే.అయితే ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో అనేది క్లారిటీ లేని అరవింద్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ని ఆఫీస్ కి పిలిపించుకొని అల్లు అర్జున్ తో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇక బన్నీ కోసం ఓ పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టుని ప్రశాంత్ కూడా నేరేట్ చేసి కన్ఫర్మ్ చేయించుకున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి పూర్తి సమాచారం త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.