స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
అల వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ తరువాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’పై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాుడ.
ఇప్పటికే కొంతమంది దర్శకుల వద్ద కథ విన్న బన్నీ, గతంలో ‘యాత్ర’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ చెప్పిన ఓ కథ బన్నీకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అయ్యాడట.
అయితే ఇదొక పొలిటికల్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది.బన్నీ ఇప్పటివరకు చేయని పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇదేగనక నిజం అయితే బన్నీ తొలిసారి పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీలో నటిస్తాడు.అయితే గతంలోనే బన్నీ మరో దర్శకుడు వేణు శ్రీరామ్తో కలిసి ఐకాన్ అనే సినిమాకు ఓకే చెప్పాడు.
ఇప్పుడు పుష్ప చిత్రం పూర్తయిన తరువాత బన్నీ ఏ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతాడో చూడాలి అంటున్నారు ఆయన ఫ్యాన్స్.ఇక పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కి్స్తున్నాడు సుకుమార్.
కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.