అల వైకుంఠపురములో హిట్ అయినా తర్వాత బన్నీ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు.హిట్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేసేందుకు ఒప్పుకోవాలని బన్నీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ మోస్ట్ ఏవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.
అంతేకాదు అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమా మొదటి భాగంపుష్ప ది రైజ్పేరుతొ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వకీల్ సాబ్ సినిమాతో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది.
అయితే ఈ సినిమా తర్వాత బన్నీ పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.అయితే అల్లు అర్జున్ ఈయనకు ఓకే చెప్పేముందు ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది.పరశురామ్ ప్రస్తుతం మహేష్ బాబు తోసర్కారు వారి పాటసినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా హిట్ అయితేనే పరశురామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి బన్నీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కు మాత్రమే అవకాశం ఇస్తూ సూపర్ హిట్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.