స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నారు.రెండు పార్టులుగా వస్తున్న పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా లైన్ లో పెట్టాడు.ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మూడు నెలల్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాడట అల్లు అర్జున్.
ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత తమిళ నిర్మాత కళైపులి ఎస్ థానుతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.మురుగదాస్ తో అల్లు అర్జున్ మూవీ ఉంటుందని కొన్నాళ్లుగా చర్చ కొనసాగుతుంది.ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఆ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పొచ్చు.అల్లు అర్జున్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న బన్నీ ఇక మీదట తన అన్ని సినిమాలు నేషనల్ వైడ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి కళైపులి ఎస్ థాను సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.
బన్నీ మాత్రం తన స్పీడ్ ను ఏమాత్రం తగ్గించట్లేదు.వరుసగా మూడు సినిమాలతో దూసుకెళ్తున్నాడు.