టాలీవుడ్లో బొమ్మరిల్లు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు భాస్కర్.పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరువాత భాస్కర్ తెరకెక్కించిన పరుగు సినిమా యావరేజ్గా మిగలడం, ఆ తరువాత ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో భాస్కర్ దాదాపు కనుమరుగయ్యాడు.కానీ ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేనితో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భాస్కర్, అఖిల్ ఇద్దరు భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే మెగా కాంపౌండ్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని భాస్కర్ అందుకున్నాడు.ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా భాస్కర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే గతంలో బన్నీకి పరుగు చిత్రాన్ని అందించడంతో, ఇప్పుడు మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.అల్లు శిరీష్తో రాబోయే సినిమా విజయాన్ని అందుకోవడంలో సక్సెస్ అయితే బన్నీతో మరో సినిమాను తెరకెక్కించే అవకాశం కూడా ఇస్తామని గీతా ఆర్ట్స్ ఆఫర్ ఇచ్చిందట.అంటే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక హిట్ సినిమా అందిస్తే మరో సినిమా చేసే అవకాశం భాస్కర్కు దక్కినట్లు తెలుస్తోంది.మరి భాస్కర్ ఈ అవకాశాన్ని ఎంతమేర వినియోగించుకుంటాడో చూడాలి.
అసలే శిరీష్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.మరి భాస్కర్ అతడికి ఎలాంటి కథను అందిస్తాడా అనే ఆసక్తి మెగా కాంపౌండ్ వర్గాల్లో నెలకొంది.