స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమాతో బన్నీ మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో చేయనున్నాడు.కాగా ఈ కాంబోకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దిల్ రాజు ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న వి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన విధానం దిల్ రాజుకు బాగా నచ్చిందట.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఇంద్రగంటి మోహన్కృష్ణతో చేసేందుకు రెడీ అయ్యాడు ఈ ప్రొడ్యూసర్.
అయితే బన్నీని దృష్టిలో పెట్టుకుని ఇంద్రగంటి ఓ కథను రాజుకు వినిపించాడట.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంద్రగంటి వంటి సెన్సిబుల్ డైరెక్టర్తో సినిమా చేయడం కరెక్ట్ కాదని బన్నీ అనుకుంటున్నాడు.
దీంతో దిల్ రాజు చిత్రానికి బన్నీ నో చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఇంద్రగంటి కూడా తన నెక్ట్స్ చిత్రాన్ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మరి రౌడీ హీరో ఈ సినిమాకు ఓకే చెబుతాడా లేడా అనేది చూడాలి.కాగా బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.