గుంటూరు జిల్లా మాచర్ల నుండి హైదరాబాద్ వరకు పాద యాత్రగా వచ్చిన అభిమాని నాగేశ్వరరావు ఎట్టకేలకు బన్నీ కలిశాడు.రెండు వారాల పాటు స్వయంగా బన్నీ అతడిని క్వారంటైన్ లో ఉంచి ఆ తర్వాత కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాత కలిసినట్లుగా టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ పై ప్రేమతో అభిమానంతో దాదాపు 250 కిలోమీటర్ల దూరం నడిచిన అభిమాని ఈసారి బన్నీని కలిసిన తర్వాతే హైదరాబాద్ నుండి తిరిగి మాచర్లకి వెళ్తాను అంటూ భీష్మించి కూర్చోవడంతో స్వయంగా బన్నీ టీం క్వారెంటైన్ కు తరలించారు.అల్లు అర్జున్ సూచన మేరకు ఆయన నాగేశ్వర్ ను క్వారంటైన్ కి పంపించడం జరిగింది.
రెండు వారాల పాటు పూర్తిగా డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్న అతను ఎలాంటి అనారోగ్యం కూడా లేదని తెలుసుకున్న తర్వాత బన్నీ కలిశాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెలబ్రిటీలు అభిమానులను కలిసేందుకు భయపడుతున్నారు.
కాని బన్నీ మాత్రం అతడిని 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు కనుక నిరాశతో పంపించవద్దని ఉద్దేశంతో కలిశాడు.నేడు బన్నీతో కలిసి ఒక ఫోటో దిగడం తో పాటు లంచ్ కూడా చేసి నాగేశ్వర్ తన సొంత ప్రాంతం మాచర్లకు బయలుదేర పోతున్నాడు.
అభిమానికి ప్రత్యేకంగా వాహనం ను ఏర్పాటు చేసి మరీ బన్నీ మాచర్లకు పంపిస్తున్నట్లు గా అల్లు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అభిమానుల విషయంలో అల్లు అర్జున్ చూపిస్తున్న అభిమానం ఇతర అభిమానులు ఫిదా అవుతున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కు రెడీ అవ్వడంతో పాటు తన ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగబోతున్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.అయినా కూడా అభిమానిని కలిసేందుకు సమయం ఇచ్చాడు.
ఈ విషయమై ఆయన్ను అభినందించకుండా ఉండలేం.