నాగేశ్వరరావు అనే అల్లు అర్జున్ వీరాభిమాని మాచర్ల గ్రామం నుంచి బన్నీని చూడాలనే కోరికతో హైదరాబాద్ కి కాలినడకన వస్తున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ విషయం తెలుసుకొని తనని తీసుకొని రావాలని ఒక టీంని పంపించాడు.
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న అతన్ని బన్నీ టీం కలిసి అల్లు అర్జున్ ని కలిపించే ప్రయత్నం చేశారు.అల్లు అర్జున్, నాగేశ్వరావుని కలిసి యెగక్షేమాలు కనుక్కున్నారు.
తన కోసం అంత దూరం నుంచి రావడం చాలా సంతోషంగా ఉందని అతనితో తన ఆనందాన్ని పంచుకున్నాడు.కాని ఇలా నడిచి రావటం చాలా భాదగా వుంది.
ఇలాంటివి మీ భవిష్యత్తు కొసమో మీ ఫ్యామిలి కొసమో చేస్తే అప్పుడు నెను చాలా గర్వం గా చెప్పుకుంటాను.దయచేసి మరొక్కసారి ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీకొసం, నీ ఫ్యామిలి కొసం చెయ్యి అంటూ తన అభిమానికి అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి అల్లు అర్జున్ తన కోసం వచ్చిన అభిమానిని కలిసి అతనికి ఉత్సాహం అందించడంతో పాటు తమ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే ఫ్యాన్స్ ముందుగా తమకంటే కుటుంబానికి, తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ అభిమానికి గుర్తుచేయడం ద్వారా తన గొప్ప మనసు చాటుకున్నాడు.అభిమానులుగా ఉండే వారు తమని స్ఫూర్తిగా తీసుకొని జీవితం ఎదగడానికి సమాజానికి ఉపయోగ పడే విధంగా తయారవ్వాలి తప్ప గుడ్డిగా అభిమానించడం కాదని సున్నితంగా క్లాస్ పీకి అభిమానికి తన బాధ్యతని గుర్తుచేశాడు.
అల్లు అర్జున్ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు వస్తున్నాయి.నిజమైన హీరోయిజం అంటే అభిమానులకి తమ బాద్యతలు గుర్తుచేయడంలోనే ఉంటుందని బన్నీ ప్రూవ్ చేసాడని మెగా అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.