స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
ఇక ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించాడు బన్నీ.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న బన్నీ, ఇందులో పూర్తిగా మాస్ లుక్లో మనకు కనిపించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా, తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా బన్నీ అనౌన్స్ చేశాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు.
అయితే ఈ సినిమాను తొలుత కొరటాల వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట.
కొరటాల శివ ఈ కథను తొలుత యంగ్ టైగర్ ఎన్టీఆర్కు వినిపించగా, ఆయన ఈ సినిమా కథలో మార్పులు చేయాల్సి ఉందని సూచించాడట.
అంతేగాక తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించనున్నాడు.ఇలా ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు చాలా ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో కొరటాల ఈ కథను బన్నీకి వినిపించగా ఆయన ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పాడట.
అంటే, బన్నీ చేస్తున్న ఈ సినిమాను తారక్ రిజెక్ట్ చేశాడా అనే ప్రశ్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.