అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ చాలా విషయంపై మాట్లాడారు.
అల్లు అర్జున్ ముందుగా ఫ్యాన్స్ ను ఎలా ఉన్నారు అంటూ మొదలు పెట్టి ఆ తర్వాత అఖిల్ కు కంగ్రాట్స్ చెప్పాడు.అఖిల్ డాన్స్, ఫైట్స్ చాలా బాగా చేస్తాడు.
ఈసారి అఖిల్ కు మంచి ప్రాధాన్యం ఉన్న కథను ఎంచుకున్నాడు.ఆయన తీసుకున్న ఈ నిర్ణయమే ఆయనకు సక్సెస్ తెచ్చి పెట్టింది.
ఇక పూజా గురించి కూడా మాట్లాడారు.
పూజా ను నేను ‘ముకుంద’ సినిమా నుండి చూస్తూనే ఉన్నాను.
డీజే సినిమా నుండి చూసుకుంటే సినిమా సినిమాకి గ్రో అవుతూనే ఉంది.ఇంకా అందంగా పైకి ఎదుగుతూనే ఉంది.
ఈ సినిమాలో పూజా చాలా బాగా చేసింది.నా సొంత సినిమా సమయంలో కూడా నేను ఆ మాట చెప్పలేదు.
ఇప్పుడు చెబుతున్నాను.పూజా ఏ హీరోతో చేస్తే ఆ హీరో సినిమా హిట్.
నువ్వు నా ఒక్కడికే స్పెషల్ అనుకున్నాను.కానీ కాదని ఇప్పుడు అర్ధం అయ్యింది.
నువ్వు అందరికి స్పెషల్ నే.అంటూ పూజా గురించి బన్నీ చెప్పాడు.
ఇక అక్కినేని హీరోలపై కూడా మాట్లాడారు.అక్కినేని అన్నదమ్ములు ఇద్దరు కొంచెం గ్యాప్ టోన్ సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లవ్ స్టోరీ సినిమాతోనే మొదలు పెట్టారు.ఇక ఇప్పుడు అఖిల్ కూడా బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించాడు.
అక్కినేని ఆనందమ్ములు ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీకి నూతన ఉత్సాహాన్ని తెచ్చారు అని అల్లు అర్జున్ తెలిపారు.