కరోనా తర్వాత సినిమాలు విడుదల చెయ్యడానికి హీరోలు, ప్రొడ్యూసర్లు భయపడి పోయారు.విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో రారో అనే అనుమానం వ్యక్తం చేసేవారు.
కానీ నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాతో ఆ భయం మొత్తం పోయిందనే చెప్పాలి.ఈ సినిమా హిట్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకులను థియేటర్స్ కు తీసుకు వచ్చేలా చేసింది.
ఇక ఈ మధ్యనే దసరా కానుకగా విడుదల అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తున్నారు.
థియేటర్స్ కు వచ్చి మరి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి.
ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో బ్యాచిలర్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.
ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా.అన్న భయంలో ఉన్న సమయంలో వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నూతన ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వడంలో అక్కినేని అన్నదమ్ములు ముందు నిలిచారని బన్నీ కామెంట్స్ చేసారు.
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ఎవ్వరూ ముందుకు రాలేదు.తమ సినిమాలను విడుదల చేస్తే పరిస్థితి ఏమిటి అని ఎవరును వారు ప్రశ్నించుకుని వెనకడుగు వేస్తున్న సమయంలో అటు నాగ చైతన్య, ఇటు అఖిల్ తమ సినిమాలతో ముందుకు రావడమే కాకుండా వాళ్ళ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో సఫలం అయ్యారని అల్లు అర్జున్ తెలిపారు.