స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు అదిరిపోయే రిజల్ట్ వచ్చి చేరింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో బన్నీ తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన అల వైకుంఠపురములో సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నటీనటులను ఓకే చేసిన దర్శకనిర్మాతలు త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
కాగా ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలో ఆయన్ను సదరు చిత్ర యూనిట్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలన్నీ కేవలం రూమర్లేనని, తాను ఎలాంటి బాలీవుడ్ చిత్రంలో నటించడం లేదని బన్నీ తేల్చేశాడు.దీంతో అల వైకుంఠపురములో హిందీ రీమేక్లో బన్నీ కేమియో పాత్రకు సంబంధించిన రూమర్లకు చెక్ పడింది.
ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప చిత్రంపైనే తన ఫోకస్ పెట్టాడని, ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే ఇతర సినిమాకు కమిట్ కాబోడని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఇక పుష్ప చిత్రంలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే.