ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకునే వారు.ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు పారితోషికం విషయంలో ఎప్పుడూ టాప్ లో ఉండేవారు.
కానీ ఇటీవలి కాలంలో మాత్రం తెలుగు హీరోలు కూడా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా దూసుకుపోతున్నారు.వరుసగా హిట్లు కొట్టారు అంటే చాలు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేస్తున్నారు.
ఇక ఇప్పుడు టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక్కసారిగా రేటు పెంచి నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.గతంలో అలా వైకుంఠపురం లో సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని రికార్డులు తిరగరాశాడు అల్లు అర్జున్.
ఇక ఇటీవలే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది.
సుకుమార్ తో కలిసి పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు అల్లు అర్జున్.దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు తర్వాత కూడా అలాంటి కథలనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.పుష్ప సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైక ప్రోడక్షన్స్ విడుదల చేసింది.
అయితే ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీసేందుకు సిద్ధమైందట.
ఇక ఈ సినిమానూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ సమకూర్చ పోతున్నాడట.అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఏకంగా లైకా ప్రొడక్షన్స్ తో తరువాత తీయబోయే సినిమా కోసం 75 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడట.అంతేకాదండోయ్ ఇక అల్లు అర్జున్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆటో లైకా ప్రొడక్షన్స్ కూడా సుముఖత తోనే ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉండబోతుంది అని టాక్ వినిపిస్తోంది.