స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో.అల్లు అర్జున్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.షహజాదా టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా నటిస్తున్నారు.
సినిమాలో పరేష్ రావెల్, మనీషా కొయిరాలా కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను అక్కడ రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని టాక్.ఆల్రెడీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
ఇప్పుడు అల వైకుంఠపురములో హిందీ రీమేక్ లో కూడా కెమియో రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్ రైట్స్ 9 కోట్ల వరకూ పలికాయని టాక్.
షహజాదా టైటిల్ తో ఆల్రెడీ రాజేష్ ఖన్నా ఓ సినిమా చేశారు.మళ్లీ ఇదే టైటిల్ తో కార్తీక్ ఆర్యన్ చేస్తున్నారు.
మరి తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా బాలీవుడ్ లో అదే ఫలితాన్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. బన్నీ పుష్ప సినిమాతో పాటుగా హిందీ అల వైకుంఠపురములో సినిమాతో కూడా అలరించాలని చూస్తున్నారు.