స్టైలిష్ స్టార అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేశాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ముచ్చటగా మూడోసారి నటించనున్నాడు.
ఈ కాంబో కోసం మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ను బన్నీ సైలెంట్గా కంప్లీట్ చేశాడు.
అల వైకుంఠపురములో షూటింగ్ను ముగించుకుని బన్నీ, సుకుమార్ సినిమాలో పూర్తి స్థాయిలో పాల్గొంటాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను 2020 వేసవి చివరినాటికి పూర్తి చేయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.రష్మిక మందన ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
మరి ఈ సినిమా ఎలాంటో జోనర్కి సంబంధించిందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.