భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు, నదులు కట్టలు తెగిపోయి చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అలెర్ట్ చేసింది.24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు ఇస్తున్నారు.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందించి విరాళం ప్రకటించారు.ఎన్టీఆర్, చరణ్, చిరంజీవి, మహేష్ బాబు 25 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు.
ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి 10 లక్షల వైరం ప్రకటించగా ఇక ఇప్పుడు అల్లు అర్జున్ 25 లక్షల భారీ విరాళాన్ని ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించాడు.
భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని వాళ్లకు నా తరపున సహాయం అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం ఇస్తున్నానని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో మేకర్స్, అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.