అల్లు అర్జున్ తెలుగు సినిమాలు చాలా వరకు మలయాళంలో సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.మలయాళంలో బన్నీ కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అంతటి వసూళ్లు నమోదు చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఉత్తర భారతంలో తన సత్తా చాటుతున్నాడు.అల్లు అర్జున్ నటించిన పాత సినిమాలు అన్ని కూడా ఉత్తర భారతంలో హిందీ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
హిందీ భాషలో శాటిలైట్ రైట్స్ ద్వారా విడుదల అయిన బన్నీ సినిమాలు వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నాయి.తెలుగులో భారీ విజయాలు సొంతం చేసుకున్న సినిమా లు అక్కడ భారీ గా యూట్యూబ్ వ్యూస్ ను దక్కించుకోవడం కామన్.
కాని ఇక్కడ నిరాశ పర్చిన సినిమా లు కూడా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజే సినిమా హిందీలో డబ్బింగ్ అయ్యింది.
ఛానెల్ లో టెలికాస్ట్ అయినా కూడా యూట్యూబ్ లో భారీ ఎత్తున ఈ సినిమా కు సంబంధించిన వీడియోకు వ్యూస్ వస్తున్నాయి.యూట్యూబ్ లో డీజే హిందీ వర్షన్ కు ఏకంగా వంద మిలియన్ ల వ్యూస్ వచ్చాయి.
సౌత్ సినిమా లకు ఇంత భారీగా వ్యూస్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.డీజే సినిమా అక్కడి వారికి విపరీతంగా నచ్చింది.అందుకే ఇంత భారీ వ్యూస్ నమోదు అయ్యాయి అంటున్నారు.బన్నీ కి ఉన్న క్రేజ్ వల్ల కూడా ఈ భారీ వ్యూస్ నమోదు అయ్యాయి.
బన్నీ సినిమా లు అన్ని కూడా బాలీవుడ్ లో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.దాంతో పుష్ప సినిమా ను నేరుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా ను రూపొందిస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.