టాలీవుడ్ లో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
హీరోగానే కాకుండా
మంచి డాన్సర్
కూడా మంచి గుర్తింపు ఉంది.అయితే అల్లు అర్జున్ డ్యాన్స్ కి సామాన్య ప్రజలే కాకుండా
పలువురు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్
గా ఉన్నారు.
అయితే ఎటువంటి స్టెప్పులను అయినా సునాయాసంగా చేస్తూ, స్టెప్స్ కు తగ్గట్టుగా తన శరీరాన్ని మలుచుకోవడం అల్లు అర్జున్ స్పెషాలిటీ.అయితే ఇటీవలే అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం వహించిన టువంటి
అల వైకుంఠపురములో
అనే చిత్రంలో ననటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ చిత్రం కథనం పరంగానే కాకుండా సంగీతం పరంగా కూడా మంచి హిట్ అయ్యింది.ఇందులో
బుట్ట బొమ్మ
అనే పాట కూడా చాలా బాగా పాపులర్ అయ్యింది.
ఎంతలా అంటే ఈ పాటకి బాలీవుడ్ స్టార్లు కూడా డాన్స్ చేస్తూ టిక్ టాక్ లో వీడియో లో అప్లోడ్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు.అయితే ఈ పాటలో అల్లు అర్జున్ వేసినటువంటి ఓ స్టెప్పు పై బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని స్పందించింది.
ఇందులో భాగంగా ఇలాంటి కఠినమైన స్టెప్పులు మీరు ఎలా చేశారు అల్లు అర్జున్ గారు అంటూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
అయితే ఈ పోస్ట్ పై తాజాగా అల్లు అర్జున్ స్పందించాడు.
తనకి సంగీతం అంటే బాగా ఇష్టమని మంచి సంగీతం తనతో ఈ డాన్స్ చేయించిందని, అంతేగాక ప్రశంసించినదుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు.దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ
దర్శకుడు సుకుమార్
దర్శకత్వం వహిస్తున్నఓ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్
లారీ డ్రైవర్
గా కనిపించనున్నట్లు సమాచారం.