టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్(Allu Arjun) ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
పుష్ప సినిమాతో ఈయనకి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పాలి.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రకు 100% న్యాయం చేస్తారని తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నటువంటి వారు ఎవరూ కూడా చేతులకు గాజులు తోడుక్కొని నుదుటిన బొట్టు పెట్టుకొని అమ్మవారి గెటప్ లో నటించారు.కానీ అల్లు అర్జున్ మాత్రం తాను చేసే పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారని ఈ లుక్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇలా సినిమాల పట్ల ఎంతో డెడికేషన్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక సినిమా షూటింగ్ సమయంలో పూర్తిగా చికెన్(Chicken) తినడమే మానేసారని తెలుస్తోంది.
షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఈయన చికెన్ తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదట.ఇక ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్(Hareesh Shankar) ఓ సందర్భంలో వెల్లడించారు.మరి అల్లు అర్జున్ చికెన్ మట్టకుండా నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం(Duvvada Jagannadham) సినిమా షూటింగ్ సమయంలో ఈయన చికెన్ తినడం మానేశారని తెలియజేశారు.
ఇందులో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి పాత్రలో నటించారు.బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఈయన కూడా ఆ పాత్రలో నటిస్తున్నందుకు చికెన్ ముట్టుకోలేదంటూ గతంలో హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దీన్ని బట్టి చూస్తేనే అల్లు అర్జున్ కు సినిమాలంటే ఎంత ప్రేమ, గౌరవం అనే విషయం అర్థమవుతుంది.