సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన కలర్ ఫొటో సినిమా ఇటీవలే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హృదయ కాలేయం మరియు కొబ్బరిమట్ట సినిమాలను అందించిన సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించాడు.
సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఫీల్ గుడ్ మూవీ ప్రతి ఒక్క పల్లెటూరులో 1990ల్లో ఇలాంటి కథలు జరిగే ఉంటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోట్ చేసిన తీరు అందరికి నచ్చి కలర్ ఫొటోకు బ్రహ్మరథం పట్టారు.
కలర్ ఫొటో సినిమాపై సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు ప్రశంసలు కురిపించి వావ్ అంటూ కామెంట్ పెట్టారు.ఆహా ద్వారా ముందే ఈ సినిమా ఫలితాన్ని ఊహించి విడుదల చేసిన అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ.
ఇంకా ఈ సినిమాకు ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ ను రంగంలోకి దించాడు. కలర్ ఫొటో యూనిట్ సభ్యులందరిని కూడా పిలిపించుకున్న బన్నీ వారికి శుభాకాంక్షలు తెలియజేశాడు.
చాలా బాగా సినిమాను తీశారు, చేశారు అంటూ అభినందించాడు.ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మరిన్ని చేయాలంటూ బన్నీ వారిని ప్రశంసించాడు.
మొత్తానికి అల్లు అర్జున్ ప్రశంసలతో కలర్ ఫొటో టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దాంతో మరో రెండు రోజుల పాటు కలర్ ఫొటోకు సంబంధించి సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కనుక కలర్ ఫొటోను మరింత మంది చూసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మొత్తానికి కలర్ పొటో ను నాన్న అల్లు అరవింద్ కొనుగోలు చేయడం వల్లే బన్నీ ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు అనేది కొందరి మాట.అసలు విషయం ఏది అయినా కూడా ఒక మంచి సినిమాను ప్రమోట్ చేసేందుకు బన్నీ ముందుకు రావడం అభినందనీయం అన్నారు.