ఒక హీరో సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను కూడా తీసుకోవాలి.కొందరు హీరోలు మాత్రం తమకు ఇచ్చిన పాత్రను చేశామా అక్కడ నుండి వెళ్లి పోయామా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఈమద్య యువ హీరోలు తమ సినిమాలను తామే ప్రమోట్ చేసుకుంటున్నారు.కొత్త తరహాలో సినిమాకు ప్రమోషన్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.
తాజాగా అల్లు అర్జున్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రం అల వైకుంఠ పురంలో.
ఈ చిత్రంకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం రెండు పాటలు శ్రోతలను ఏ స్థాయిలో అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా దర్శకుడు త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఇదే సమయంలో బన్నీ కూడా సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
ఇక సినిమా ప్రమోషన్ కోసం తన పిల్లలను కూడా బన్నీ దించాడు.నేడు బాలల దినోత్సవం సందర్బంగా అల వైకుంఠపురంలో సినిమా నుండి ఒక పాట ప్రోమోను విడుదల చేశారు.అందులో అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు సందడి చేశారు.
వారు పాటలో ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఒక్కసారిగా ఆ పాట గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇటీవలే మహేష్బాబు తన ఇద్దరు పిల్లలను బుల్లి తెర యాడ్ కోసం నటింపజేస్తే ఈసారి అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్ కోసం నటింపజేశారు.సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.