అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మరియు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.నువ్వా నేనా అన్నట్లుగా ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.
నిన్న మొన్నటి వరకు విడుదల తేదీ విషయంలో పెద్ద ఫైటింగ్ జరిగింది.చివరకు మహేష్ బాబు మూవీ ఒక్క రోజు ముందు అంటే ఈనెల 11న విడుదలకు ఒప్పుకోవడంతో పెద్ద యుద్దం తప్పినట్లయ్యింది.
ఇక భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం హీరోలు ఒక సినిమాకు ఒకరు విశెష్ చెప్పుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
అల వైకుంఠపురంలో సినిమా వేడుక సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్రంపై స్పందించాడు.
మహేష్ బాబు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశాడు.అదే సమయంలో నా సినిమాతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న ఇతర సినిమాలు అన్ని కూడా విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ కోరుకున్నాడు.
మొత్తానికి ఈ మాటలతో అల్లు అర్జున్ మంచి వాడు ఇతర హీరోల సినిమాలు సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాడు అంటూ ప్రచారం మొదలైంది.
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తమ హీరోలు ఇతర హీరోలకు శుభాకాంక్షలు చెప్పడంలో చాలా ముందు ఉంటారు అంటూ చెబుతున్నారు.అన్ని విధాలుగా మెగా హీరోలు ఇండస్ట్రీ బాగును కోరుకుంటారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద ఎత్తున ఈ విషయమై సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు మాత్రం అల వైకుంఠపురంలో సినిమా గురించి స్పందించలేదు.