స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కూడా ఫ్యామిలీ కి సమయం కేటాయించడంలో ముందు వరుసలో ఉంటాడు.ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో సమయం గడుపుతూ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటాడు.
తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసాడు.
తన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకున్నారు.ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్ల ద్రుష్టి ఆకర్షించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరికొన్ని ఫోటోలను స్నేహ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ ఫొటోల్లో అల్లు అర్జున్, స్నేహ వాళ్ళ పిల్లలు అర్హ, అయాన్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ పిక్స్ చుసిన నెటిజెన్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.స్నేహ ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇష్టమైన వారు పక్కన ఉండగా జరిగిన బర్త్ డే మరింత స్పెషల్ అయ్యిందని తెలిపింది.
ఇంకా ఆ ట్రిప్ కు వెళ్లిన దగ్గర అందాలను కూడా చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.అందులో ఒక ఫోటో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
అల్లు అర్జున్ తో కలిసి తన భార్య స్నేహ, పిల్లలు కలిసి దిగిన ఫోటో బాగా ఆకట్టుకుంటుంది.ఈ ఫోటో సూపర్ అంటూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ ఇక మళ్ళీ పుష్ప సినిమాలో జాయిన్ అవ్వబోతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతుంది.