రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి.ప్రభాస్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే.
బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని నేషనల్ వైడ్ వివిధ భాషలలో విడుదల కావడం వల్ల ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది.అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆది పురుష్ చిత్రంతోపాటు, నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఇప్పటికే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటించే ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది.
అయితే ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా అలా వైకుంఠపురం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటూ వెళుతున్నాడు .సోషల్ మీడియాలో ప్రభాస్ కన్నా అల్లు అర్జున్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు తన వీడియోల ద్వారా ఆకట్టుకుంటున్నాడు.
సోషల్ మీడియా ఆధారంగా ఓ ప్రైవేట్ సంస్థ సర్వే నిర్వహించగా, ఆ సర్వేలో ప్రభాస్ కన్నా అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడయింది.ఈ సర్వేలో అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండవ స్థానంలో ప్రభాస్ ఉన్నాడు.
అయితే వరుసగా మూడు, నాలుగు స్థానాలలో మహేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు.ఐదవ స్థానంలో ఎన్టీఆర్,ఆరో స్థానంలో చిరంజీవి, ఏడో స్థానంలో రామ్ చరణ్, 8వ స్థానంలో విజయ్ దేవరకొండ, 9వ స్థానంలో నాని ఆ తర్వాత స్థానాల్లో వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ కన్నా ప్రభాస్ కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసినదే అయినప్పటికీ, ఈ సర్వేలో మాత్రం అల్లు అర్జున్ ప్రభాస్ ను బీట్ చేసాడు.అయితే ప్రభాస్ నటించనున్న రాధేశ్యామ్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.