టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.
అయితే ఈ చిత్రం ఇప్పటికే చాలా సైలెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది.అయితే తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ న్యూ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఫోటోలు నెట్ లో బాగానే వైరల్ అవుతున్నాయి.
తాజాగా సుకుమార్ చిత్రం కోసం అల్లు అర్జున్ తన జుట్టుని బాగా పెంచేసాడు.అంతే కాక లారీ డ్రైవర్ పాత్రలో ఈ సారి మాస్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తుండటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి ఈ చిత్రం యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఉండటంతో అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ కోసం కేరళ రాష్ట్రంలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.
దీంతో దర్శకుడు సుకుమార్ ర్ ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఇప్పటికే బన్నీ హీరోగా నటించినటువంటి అల వైకుంఠ పురములో చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది.అంతేగాక వసూళ్ళ పరంగా కూడా దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.దీంతో అల్లు అర్జున్ తన విజయ పరంపరను కొనసాగించేందుకు బాగానే శ్రమిస్తున్నాడు.