చెప్పను బ్రదర్‌ తర్వాత ‘గారు’... బన్నీని ఆడేసుకుంటున్న సోషల్‌ జనాలు

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజాగా యంగ్‌హీరో శర్వానంద్‌ నటించిన ‘పడిపడిలేచే మనసు’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు.ఈ సందర్భంగా హీరో శర్వాను గారు అంటూ సంబోధించాడు.

 Allu Arjun At Padi Padi Leche Manasu Movie Launch-TeluguStop.com

అంతేకాకుండా సినీ, రాజకీయ రంగాల్లోని నాయకులను గారు అని సంబోదించడం మర్యాద అంటూ చెప్పుకొచ్చాడు.వారికంటూ ఒక అభిమాన వర్గం ఉంటుంది కాబట్టి ఎంత సన్నిహితులు అయినా కూడా బహిరంగా మర్యాదగా మాట్లాడుకోవడం సంస్కారం అంటూ క్లాస్‌ పీకాడు.

కొన్ని టీవీ ఛానెల్‌ల వారు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతారు.అలాకాకుండా గారు అని సంబోదిస్తూ మాట్లాడితే వారి అభిమానులు సైతం తృప్తి పడుతారు.అందుకే శర్వా నాకు సన్నిహితుడు అయినప్పటికి ఇక్కడ శర్వా అభిమానులు చాలామంది ఉంటారు కాబట్టి గారు అని మర్యాద పూర్వకంగా పిలుస్తున్నాను అంటూ లెక్చర్‌ ఇచ్చాడు.దాంతో సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ మీమ్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇన్నాళ్లు ఈ మర్యాద ఎక్కడకు పోయింది బాబు అంటూ సోషల్‌ జనాలు బన్నీని ఆడేసుకుంటున్నారు.

గతంలో కూడా ఒక కార్యక్రమంలో మెగా అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ గురించి అడగగా చెప్పను బ్రదర్‌ అంటూ అల్లు అర్జున్‌ సీరియస్‌ అయిన విషయ తెల్సిందే.ఆ తర్వాత పవన్‌ అభిమానులు బన్నీని తీవ్రంగా వ్యతిరేకించారు.కొంతకాలం తర్వాత బన్నీ మళ్లీ పవన్‌ అభిమానులను కూల్‌ చేస్తు కోపాన్ని తగ్గించుకున్నాడు.

ఇక తాజాగా గారు, మర్యాద అంటూ మరోసారి క్లాసులు చెప్పుకొచ్చాడు.దీంతో బన్నీని సోషల్‌ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube