చలన చిత్ర పరిశ్రమలో సైమా అవార్డుల ప్రధానోత్సవం ఒక పండుగలాగా జరుగుతుంది.దక్షిణాది రాష్ట్రాలలోని సినీ ప్రముఖులందరూ ఒకే వేదికపై చేరి ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ప్రధానోత్సవం 2019,2020 సంవత్సరంలో జరగాల్సిన ఈ వేడుక కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ఈ ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే 2019 సంవత్సరంలో అవార్డులు గెలుచుకున్న వారికి శనివారం ఈ అవార్డులను అందించగా 2020 విజేతలకు ఆదివారం అవార్డులను అందించారు.
ఈ క్రమంలోనే సైమా 2020.
ఉత్తమ నటుడిగా అవార్డులు అల్లు అర్జున్ అందుకున్నారు.అలా వైకుంఠపురం సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ సైమా 2020.
ఉత్తమ నటుడిగా ఎంపికకాగా ఆదివారం అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నారు.అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సైమా 2020.అవార్డులలో భాగంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఈ అవార్డును అందుకున్నారు.
ఇకపోతే సైమా 2020.ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే.అలా వైకుంఠపురం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు.ఇలా ఒకే సినిమా నుంచి ఉత్తమ నటుడు నటిగా అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.
అయితే 2020 సైమా అవార్డులలో భాగంగా అలా వైకుంఠపురం సినిమాకు అవార్డుల జాతర జరిగినట్లు తెలుస్తోంది.కేవలం ఉత్తమ నటి నటుడు అవార్డులను మాత్రమే కాకుండా… ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ దర్శకుడు, ఉత్తమ విలక్షణ నటుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ గేయరచయిత వంటి అవార్డులు కూడా అలా వైకుంఠపురం సినిమాకు రావడం విశేషం.