అవును మీరు చూస్తున్నది నిజమే.ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఆర్మీ యాప్ వస్తుంది.
ఈ నెల 23వ తేదీన ఈ యాప్ ను లాంచ్ చెయ్యనున్నారు.కానీ ఈ యాప్ ను లాంచ్ చేస్తుంది అల్లు అర్జున్ కాదు.
అల్లు అర్జున్ అభిమాన సంఘం.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో కూడా అల్లు అర్జున్ అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు.అందుకే కరోనా లాక్ డౌన్ సమయంలోను కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా కేరళకు సైతం విరాళాలు ఇచ్చాడు.
ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులు కొందరు.అల్లు అర్జున్ ఆర్మీ యాప్ ను తీసుకొచ్చారు.ఈ యాప్ లో అల్లు అర్జున్ కు సంబంధించిన సమాచారం అంత ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందజేసేందుకు.కొత్త కొత్త ఫోటోలను, వీడియోలను ఈ యాప్ లో అప్డేట్స్ ఇస్తుంటారు.
ఇంకా ఈ యాప్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్మీ యాప్ ట్రెండ్ నడుస్తోంది.
ఈ యాప్ కు సంబంధించి వరుస ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
మరో వైపు అల్లు అర్జున్ ఆహాలో ప్రసారం అవుతున్న సామ్ జామ్ షో కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.సమంత హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ షోలో ఎన్నో విషయాలను అల్లు అర్జున్ పంచుకోగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అయినా సంగతి తెలిసిందే.