అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.ఒక వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా మొదలు పెట్టారు.
షూటింగ్ పూర్తి అయినంత వరకు డబ్బింగ్ కార్యక్రమాలు ముగించేందుకు తాజాగా మైత్రి వారు పూజా కార్యక్రమాలతో పుష్ప సినిమా డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్న ఈ పూజా కార్యక్రమం కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమా టీజర్ ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో బన్నీతో డబ్బింగ్ చెప్పేందుకు నేడు పూజా కార్యక్రమాలు చేయించారు. రేపు విడుదల కాబోతున్న టీజర్ లో బన్నీ వాయిస్ ఉంటుంది.
ఆ వాయిస్ ను డబ్బింగ్ చెప్పేందుకు నేడు డబ్బింగ్ పూజా కార్యక్రమాలు చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు అయిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టిన పుష్ప ఈ నెల మూడవ వారం నుండి మళ్లీ సెట్స్ కు వెళ్లబోతున్నాడు.ఈ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు గా 75 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో మలయాళ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక సునీల్ కు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర దక్కినట్లుగా తెలుస్తోంది.